తెలంగాణ
Revanth Reddy: బీఆర్ఎస్ గద్దెలను కూల్చాల్సిందే

Revanth Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ గద్దెలను కూల్చినపుడే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి అని, చంద్రబాబు అభిమానులకు పండుగ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిచి అభివృద్ధి నిరోధకులకు బుద్ది చెప్పాలని ఓటర్లకు రేవంత్ పిలుపునిచ్చారు.
ఖమ్మం ప్రజలు బీజేపీకి ఎంట్రీ లేకుండా చేశారని వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు పట్టం కట్టాలన్నారు. మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు వార్తలు రాసేటప్పుడు తనను వివరణ తీసుకోవాలని మీడియాకు సీఎం రేవంత్ సూచించారు.



