ఆంధ్ర ప్రదేశ్
ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో సినిమా నిర్మాతల భేటీ

టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్తో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కావాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామని అన్నారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలు వింటామన్నారు.
ఈ అంశంపై ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలన్నారు. ప్రభుత్వ జోక్యం అవసరమైతే సీఎం , డిప్యూటీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు.



