ఆంధ్ర ప్రదేశ్
Bhumana: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు పోలీసుల నోటీసులు

Bhumana: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆరోపణలపై మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. శ్రీవెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన ఆరోపణలు చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని భూమన కరుణాకర్రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 23న యూనివర్సిటీ పీఎస్కు హాజరుకావాలని ఆదేశించారు. టీటీడీ మెంబర్ భానుప్రకాష్రెడ్డి ఫిర్యాదు మేరరకు పోలీసులు కేసు నమోదు చేశారు.



