వంశీ కేసు విచారణలో బయటపడుతున్న సంచలనాలు

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. వంశీకి పలువురు మహిళలతో ఆర్థిక సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ జీతం, అతి తక్కువ సమయంలోనే ఓ మహిళా ఎయిర్ హెస్టెస్ కోట్లకు పడగలెత్తినట్లు గుర్తించి షాకింగ్కి గురయ్యారు. కాస్లీ కార్లు, విలాసవంతమైన భవనాల్లో జీవితాన్ని చూసి పో లీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మహిళా ఎయిర్ హెస్టెస్ నివాసం హనుమాన్ జంక్షన్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
వంశీ-ఎయిర్ హోస్టెస్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వంశీ అనుచరుడు రంగా కోసం గాలిస్తుండగా.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా సమాచారం సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్ ద్వారా ఆర్థిక మూలాలు బయటపడ్డాయంటున్నారు. ఇక మరో మహిళ సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిగా గుర్తించారు. అయితే ఆమె గన్నవరానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకుని హైదరాబాద్లో ఉన్నట్లు తేల్చారు.
వంశీ-రంగా-మహిళ మధ్య కోట్లాది ఆర్థిక లావాదేవీలు జరిగాయంటున్న పోలీసులు.. చింతలపూడి, జంగారెడ్డిగూడెం పరిసరాల్లో 15 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏలూరులో 3 ఎకరాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, హైదరాబాద్లో ఖరీదైన అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. ఎయిర్ హోస్టెస్తో కలిసి చార్టెడ్ ఫ్లైట్ కొనేందుకు బేరసారాలు జరిగినట్లు చూసిన పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బోటిక్ నిర్వహించే మహిళతో కూడా ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెబుతున్నారు. మల్లవల్లిలోని 175 ఎకరాల మట్టి కుంభకోణం అంపాపురానికి చెందిన ఓ పొలిటీషియన్ తమ్ముడితో కలిసి భూ కుంభకోణం పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఒరిస్సాలో 300 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.