India- Pakistan: పాకిస్థాన్ లాహోర్లో టెన్షన్ టెన్షన్.. భయాంతో వణికిపోతున్న పాకిస్థాన్

India- Pakistan: పాకిస్థాన్లోని లాహోర్, కరాచీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆర్థిక కేంద్రమైన కరాచీలో పేలుళ్లు సంభవించాయి. లాహోర్లో అనేక పేలుళ్లు సంభవించిన తర్వాత, కరాచీలో సైతం పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాహోర్లోని వాల్టన్ రోడ్డులోని సైనిక విమానాశ్రయం సమీపంలో భారీ శబ్ధంతో పేలుళ్లు సంభవించాయి. కొన్ని నివేదికల ప్రకారం.. వాల్టన్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ కనిపించిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
లాహోర్లోని అస్కరి 5 సమీపంలో ఈ ఉదయం రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఆపరేషన్ సిందూర్ తరువాత ఈ దాడులు జరగడంతో ప్రజల్లో భయాందోళన కనిపిస్తోంది. వాల్టన్ ఎయిర్ పోర్టులో నసీరాబాద్, గోపాల్ నగర్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించడంతో ఎయిర్ సైరన్ల మోత మోగింది. పేలుళ్లు అనంతరం ప్రజలు భయాందోళకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న వీడియోలను పాక్ మీడియా రిపోర్ట్ చేసింది.
పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, గుజ్రన్వాలా సహా పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయని, పేలుళ్లు సంభవించాయని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం 12 డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయని, ఇదంతా భారత్ పనేనని పాక్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్తాన్ లోని పలు నగరాలు లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు డ్రోన్ దాడులు చేపట్టాయని, కొన్ని డోన్లను తాము పేల్చివేశామని సైతం పాక్ చెబుతోంది. భారత్ వైపు నుంచే డ్రోన్లు వచ్చాయని పాక్ ప్రచారం చేస్తోంది.
పాక్ చేసిన ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. పాకిస్తాన్ నిరాధార ఆరోపనలు చేస్తోందని.. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రపంచం మొత్తానికి బహిరంగంగా చెప్పామన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయిం ఇస్తూ, వారిని ప్రోత్సహించి భారత్ మీద దాడులు చేపిస్తున్న పాక్ ప్రభుత్వం.. అంతటితో ఆగకుండా సామాన్యులపై భారత సైన్యం దాడులకు దిగిందని కట్టుకథలు అల్లుతోందని సాక్ష్యాలతో సహా నిరూపించింది. అయినా పాక్ వక్రబుద్ధి మార్చుకోలేదు.
భారతదేశం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ దాడి అనంతరం పాకిస్తాన్ కీలక చర్యలు చేపట్టింది. పాక్ విమానాశ్రయాల అధికార సంస్థ కరాచీ, లాహోర్, సియాల్కోట్తో సహా ప్రధాన విమానాశ్రయాలకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.