ఆంధ్ర ప్రదేశ్
నారాలోకేష్ పర్యటన నేపథ్యంలో ఓ వర్గం ఆందోళన

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వర్గం ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్న చంద్రశేఖర్ నాయుడు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాల్లో తానే అంతానడిపిస్తూ ఎమ్మెల్యేని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు.
వెంటనే చంద్రశేఖర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యే ఆదిమూలంను అణచివేసే చర్యలను మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పోకడలను కొనసాగిస్తే దళితులు ఐక్యంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.