ఆంధ్ర ప్రదేశ్
Chittoor: తెల్లవారుజామున గజరాజుల గుంపు హల్చల్

Chittoor: తెల్లవారుజామున గజరాజుల గుంపు హల్చల్ చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని.. ననియాల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో ఏక్షణాన ఏం జరుగుతోందనని గ్రామస్తులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.
ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా వాహనదారులు, ప్రయాణికులు వీడియో తీశారు. మరోవైపు వారం రోజులుగా గ్రామాల్లోని పంటలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.