జాతియం
Modi: సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన

Modi: సింహాచలం ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.