తెలంగాణ
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో రసాభాస

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో రసాభాస జరిగింది. ఎస్సీ నాయకులను వేదికపైకి ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకుడు ముడుసు సత్యనారాయణ రాష్ట్ర నాయకులను నిలదీశారు. ఎస్సీ నాయకులు ఉన్నారని రాద్ధాంతం చేయవద్దని సత్యనారాయణపై రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నాయకత్వానికి చెప్పుకోవాలని కానీ ఇలా సమావేశంలో బహిర్గతం చేసుకోవద్దని నాయకులు హితవు పలికారు. పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయవద్దని రాష్ట్ర నాయకులు సూచించారు.