తెలంగాణ
Seethakka: ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి

Seethakka: హైదరాబాద్ లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను కలిసిన ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరారు.
ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలని మంత్రి సీతక్క కోరారు. ఏ ప్రాంతంలోనైనా శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలని సూచించారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు.