జాతియం
Tamil Nadu: పోలీస్ స్టేషన్లో చిరుత.. కలియ తిరిగి ఏం చేసిందంటే..!

Tamil Nadu: పోలీస్ స్టేషన్లో చిరుత సంచారం కలకలం రేగింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పీఎస్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి పోలీస్ స్టేషన్లోకి చొరబడిన చిరుత పీఎస్ అంతా కలియతిరిగింది. ఇది చూసిన కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యాడు.
చిరుత బయటకు వెళ్లడంతో వెంటనే పోలీస్ స్టేషన్ తలుపులు మూసివేశాడు. చిరుత పీఎస్లో కి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.