India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్య.. భారత సైన్యంపైకి పాక్ కాల్పులు

India-Pakistan: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉన్నట్టుండి కశ్మీర్లోని ఎల్వోసీ దగ్గర అలజడి రేగింది. దాయాది సైన్యం కా ల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట పలు ప్రాంతాల్లో పాక్ పోస్టులు నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది.
మరోవైపు జమ్మూకశ్మీర్లోని బందిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇక్కడ తొలుత భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
అదేవిధంగా నేడు జమ్ముకశ్మీర్లో ఆర్మీ చీఫ్ జనరల్ పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. కాల్పుల విర మణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహిస్తున్నారు.