భయం భయం.. ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతి

ప్రకృతి సౌందర్యాల మధ్య ఉంటుంది ఆ గ్రామం. ఆదివాసుల సంప్రదాయాలు కట్టుబాట్లకు నిలయం. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఓ 11 కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయి. ఊరంతా పచ్చదనం ఏమైదో ఏమో తెలియదుకానీ ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు.
అంతే ఆ గ్రామంలోని ఆదివాసీల గుండెల్లో గుబులు మొదలైంది. అంతే అక్కడ కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్న 11 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు.
కొమురంభీం జిల్లా తిర్యాని మండలం సమతుల గుండం గ్రామం. ఈ గ్రామంలో 11 కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆత్రం రాజు కుటుంబం నెల రోజుల వ్యవదిలో నే నలుగురు చనిపోయారు. ఆత్రం రాజు, సోను బాయి బార్య భర్తలిద్దరు అనారోగ్యంతో చనిపోయారు. ఆ ఇద్దరు చనిపోయిన వారం వ్యవదిలోనే కుమారులు బీము, మారుతి సైతం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మిగిలిన 11 కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
గ్రామంలో ఏదో కీడు జరగబోతోందని ఇక్కడే ఉంటే తమ కుటుంబాలు కూడా గాల్లో కలుస్తున్నాయి. ఊరు ఊరంతా ఏకమై వలస వెళ్లే నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామ పటేల్ తో సంప్రదించి గ్రామాన్ని ఖాళీ చేసి వీరే గ్రామానికి వెళ్లి అంగన్వాడీ సెంటర్ లో కొన్ని కుటుంబాలు ఆశ్రమం పొందగా మరికొన్ని కుటుంబాలు కొత్తగా గుడిసెలను ఏర్పాటు చేసుకొని ఆశ్రమం పొందుతున్నారు.
వ్యవసాయ పనులు యాథావిధిగా చేసుకుంటూ సాయంత్రానికి ప్రభుత్వ పాఠశాలలో బస చేయడానికి సుమారు 40 మంది గ్రామస్థులు తిరిగి చేరుకుంటున్నారు. మళ్లీ సమతులగుండంకు వెళ్లేది లేదని, అక్కడే కొత్త గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.
గ్రామస్తుల్లో ఉన్న మూడ నమ్మకాలను రూపుమాపేందుకు పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సమతులగుండం గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో మూడు నమ్మకాల భయంతో ఏ గ్రామాన్ని వదిలి లింగపూర్ మండలంలోని భీమన్ గొంది గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి వివరాలను అడిగితీసుకున్నారు.
మూఢనమ్మకాల పై అవగాహన కల్పించారు,అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భీమన్ గొంది గ్రామం నుండి మళ్లీ సమతుల గుండం గ్రామానికి తిరిగి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మూడ నమ్మకాలను వీడాలని చిత్తరంజన్ అన్నారు. గ్రామ ప్రజలకు అండగా ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖా ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు ప్రజా సేవలు చేయడంలో ముందుంటారని ఆదివాసి గిరిజనులకు తెలియజేశారు.