తెలంగాణ
Kishan Reddy: ఇలాంటి దాడులతో భారత్ను భయపెట్టలేదు

Kishan Reddy: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ నిరసన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఉగ్రవాదు లు టూరిస్ట్లపై విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు.
ఒకవర్గం వారిని టార్గెట్ చేసి జరిపిన దాడిని ప్రపంచమంతా ఖండిస్తోందని చెప్పారు. పాకిస్తాన్లో అసమర్ధ నాయకత్వం నడుస్తోందన్నారు. అంతర్గత వ్యవహారాన్ని సరిదిద్దుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉందన్నారు కిషన్ రెడ్డి. ఇలాంటి దాడులతో భారత్ను పాకిస్తాన్ భయపెట్టలేరన్నారు కిషన్ రెడ్డి.