తెలంగాణ
ముగ్గురు తెలంగాణ మంత్రులకు తప్పిన ప్రమాదం

Telangana: ముగ్గురు తెలంగాణ మంత్రులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. నిజామాబాద్లో రైతు మహోత్సవ సభ ఏర్పాటు చేయగా స్టాల్స్ పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.
అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో, వీచిన గాలితో స్వాగత తోరణాలు పడిపోయింది. దీంతో పాక్షికంగా పలు స్టాల్స్ దెబ్బతిన్నాయి. అసలు ఏం జరుగుతుందోనని నిజామాబాద్ సభకు వచ్చిన జనం కూడా పరుగులు పెట్టారు. ఇక వేదిక వద్దే హెలిప్యాడ్ సిద్ధం చేయడంతో అపశృతి జరిగింది.