తెలంగాణ
Hyderabad: ఏప్రిల్ 23న హైదరాబాద్ 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నిక

Hyderabad: 22ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ వైపేనే ఉంది. బలాబలాల్లో మజ్లిస్కు మొగ్గు ఉన్నా వార్ వన్ సైడ్ కాదంటోంది బీజేపీ. ఇంతకీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతోంది..? గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది? అన్నదీ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం. కానీ ఇప్పుడలా కుదరదంటూ బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ. పాతబస్తీపై పట్టున్న మజ్లీస్కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడింది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. దాదారు 22ఏళ్ల తర్వాత ఎల్లుండి ఎన్నిక జరగనుంది.