తెలంగాణ

Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎంకు అధికారులు వివరించారు.

నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button