ఆంధ్ర ప్రదేశ్
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. రోద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ల అనే మహిళ రెండో కాన్పు కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రసవానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఉదయం ఇద్దరు మగపిల్లలు ఒక ఆడశిశువును ప్రసవించింది. సాధారణ కాన్పుకావడంతో తల్లి, బిడ్డలు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. జన్మించిన శిశువులు ఒక కిలో 200 గ్రాములు ఉండడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.