తెలంగాణ
Uttam Kumar Reddy: కేంద్రం సన్న బియ్యం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదు

Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. కేంద్రం సన్న బియ్యం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చేది దొడ్డు రకం బియ్యమన్నారు. గతంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేశామని ఉత్తమ్ తెలిపారు. ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.
తెలంగాణలో 30లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులను కలెక్టర్లు పరిశీలిస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. సన్న బియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార ప్రజాప్రతినిధులు సమర్ధవంతంగా తిప్పికొట్టాలన్నారు.