తెలంగాణ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్లో భూ మాఫియా రెచ్చిపోయింది. ఫేస్-2లోని ప్లాట్ల యజమానుల ను భయభ్రాంతులకు గురిచేశారు. గుండాలను వేసుకొని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో కబ్జా రాయుళ్లపై ప్లాట్ల యజమానులు ఒక్కసారిగా తిరగబడ్డారు.
ఇద్దరి మధ్యలో రాళ్ల దాడులు, తోపులాటలు జరిగాయి. దీంతో కొద్దిసేపు హైటెన్షన్ చోటుచేసుకుంది. ఘటనలో రెండు ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టగా అవి పూర్తిగా దగ్ధం అయ్యాయి. దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.