తెలంగాణ
కేటీఆర్కు అరుదైన గౌరవం

KTR: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం, ఇవాన్ స్టన్ లో ఉన్న ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో.. ఏప్రిల్ 19న జరిగే కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్-2025 లో.. ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాలని కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల లేఖలో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ వంటి వినూత్న ఆలోచనల వల్ల తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందిందని, ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.