తెలంగాణ

Charminar: చార్మినార్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు

Charminar: హైదరాబాద్‌కే తలమానికం అయిన చార్మినార్‌ పెచ్చులు ఊడిపడ్డాయి. వర్ష ప్రభావం కారణంగా నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. ఈ విధంగా శుభ్రం చేసి, రంగు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది. ఇలాంటి గొప్ప చారిత్రక వైభవం ఉన్న కట్టడాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button