KTR: మాపై బురద చల్లేందుకు ప్రయత్నం జరుగుతోంది

KTR: కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఐటీ పార్కులు, ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి “ఫ్యూచర్ సిటీ”లో 14,000 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైన పర్యావరణాన్ని లక్ష్యంగా చేసుకుని, ప్రస్తుత నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు.
కంచె గచ్చిబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏప్రిల్ 1న ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది. 400 ఎకరాలపై హైకోర్టు తీర్పును తామే సాధించినట్టు డబ్బా కొట్టింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఈ కేసును పట్టించుకోలేదని మంత్రులు దుష్ప్రచారం చేశారు. ఏమాత్రం ఆలోచించేవారికైనా ఈ వాదనలో పసలేదని ఇట్టే తెలిసిపోతుంది.