తెలంగాణ
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో జరగనున్న ఈ భేటీలో రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రేవంత్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.