తెలంగాణ

Vikarabad: విషాదం.. గిరిజన హాస్టల్‌లో టెన్త్‌ విద్యార్థి మృతి

Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో విషాదం చోటుచేసుకుంది. గిరిజన బాలుర వసతి గృహంలో.. విద్యార్థి దేవేందర్ అనుమానస్పద మృతి చెందాడు. చనిపోయిన స్టూడెంట్ పదో తరగతి చదువుతున్నట్లు తెలుస్తుంది. రాత్రి పడుకున్న విద్యార్థి ఉదయం లేవకపోవడంతో హాస్టల్ సిబ్బంది పరిగి ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు తమ కుమారుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు హాస్టల్ ‌లో ఎలాంటి గొడవ జరగలేదని తోటి విద్యార్థులు చెప్పారు. ఇటు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఆందోళనల నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button