తెలంగాణ
Medaram: మేడారంలో మినీ జాతర ప్రారంభం
Medaram: మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మినీ జాతర కు 5కోట్ల 30లక్షలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇక మేడారం వెళ్లే భక్తుల కోసం 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. వెయ్యిమంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక తెలుగురాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగు వద్ద జల్లు స్నానాలను ఆచరిస్తున్నారు.