తెలంగాణ
వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగ నోట్లతో మోసం

Vikarabad: దొంగ నోట్లతో అమాయకులను మోసం చేస్తున్న ఘటన.. వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది. సీఎస్సీ ఆన్లైన్ సెంటర్ నుంచి.. 30 వేల రూపాయిలను డ్రా చేయించుకుంది రైతు సుగుణమ్మ. అయితే.. వారం తర్వాత అవి నకిలీవిగా గుర్తించింది బాధితురాలు. దీంతో.. ఆ సొమ్ముతో ఆన్లైన్ సెంటర్ దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టింది సుగుణమ్మ. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు హైమాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.