తెలంగాణ
Suryapet: సూర్యాపేట హత్య కేసులో ట్విస్ట్.. నాన్నమ్మ కళ్లల్లో ఆనందం కోసమే హత్య

Suryapet: సంచలన రేపిన సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ, తండ్రి సైదులు, సోదరులు నవీన్, వంశీ, స్నేహితుడు మహేష్తో పాటు సాయి చరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై అట్రాసిటీ, హత్యా నేరం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ సన్ ప్రీత్ తెలిపారు. నిందితుల నుంచి కారు, కత్తి, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నాన్నమ్మ కళ్లల్లో ఆనందం కోసమే హత్య చేశారని ఎస్పీ తెలిపారు.