జాతియం
PM Modi: చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రూ. 413 కోట్ల నిధులు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త హంగులతో ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు రైల్వే శాఖకు అవకాశం ఏర్పడింది.
టెర్మినల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం వర్చువల్గా పాల్గొన్నారు. చర్లపల్లి స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ జిష్ణుదేవ్ తదితరులు పాల్గొన్నారు.