Uttar Pradesh: అయ్యో.. మొబైల్ లో రీల్స్ చూస్తూ బిజీగా ఉన్న డాక్టర్.. గుండెపోటుతో మహిళ మృతి

Uttar Pradesh: మెయిన్పురి జిల్లా ఆసుపత్రిలో 60 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. డ్యూటీలో ఉన్న వైద్యుడు ఆదర్శ్ సెంగార్ రోగికి సహాయం చేయకుండా సుమారు 15 నిమిషాల పాటు మొబైల్లో రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆసుపత్రిలో కలకలం సృష్టించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.
దీనిపైనా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
డాక్టర్ సహాయం చేయలేదని కుటుంబీకులు చెప్పారు
మహిళ పేరు ప్రవేశ్ కుమారి, మంగళవారం మధ్యాహ్నం ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చారు. మహిళను వ్యక్తిగతంగా తనిఖీ చేయకుండా, ఆమెకు ట్రీట్మెంట్ చేయమని నర్స్ కి చెప్పాడు.మహిళ పరిస్థితి విషమించినప్పటికీ డాక్టర్ ఆమె దగ్గరికి వచ్చి చూడకుండా మొబైల్ లో రీల్స్ చూస్తూనే ఉన్నాడు. కుటుంబీకులు ఎన్నిసార్లు విన్నవించినా వైద్యుడు మహిళకు చికిత్స అందించలేదు. ప్రవేశ్ కుమారి పరిస్థితి విషమించడంతో, ఆమె కుమారుడు నిరసన వ్యక్తం చేయడంతో, వైద్యుడు అతనిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటన ఆస్పత్రిలో కలకలం సృష్టించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజీ వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. CCTV ఫుటేజీలో, డాక్టర్ తన డెస్క్ వద్ద బిజీగా కూర్చున్నట్లు తన మొబైల్లో చూడవచ్చు, అయితే నర్సు రోగికి ట్రీట్మెంట్ చేస్తుంది. మహిళ కుమారుడిని డాక్టర్ చెంపదెబ్బ కొట్టడం కూడా మనం సీసీటీవీ లో చూడవొచ్చు.
ఆమె కుమారుడు గురు శరణ్సింగ్ ఘటనను వివరిస్తూ.. తన సోదరులతో కలిసి తన తల్లిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అతను సహాయం కోసం వైద్యుడిని అడిగాడు, కానీ వైద్యుడు చికిత్స కోసం నర్సును పంపించాడు. మహిళ పరిస్థితి క్షీణించి, రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించినప్పుడు, కుటుంబం సహాయం కోసం పదేపదే వైద్యుడికి విజ్ఞప్తి చేసింది, కానీ అతను తన మొబైల్లో బిజీగా ఉన్నాడు. ఆసుపత్రిలో స్ట్రెచర్పై మహిళ చనిపోవడంతో, అతను డాక్టర్తో వాగ్వాదానికి దిగాడు ఈ సమయంలో డాక్టర్ అతని చెంపదెబ్బ కొట్టాడు.