జాతియం
Uttar Pradesh: లడ్డూ మహోత్సవంలో కూలిన వేదిక.. ఐదుగురు మృతి, 40 మందికి గాయాలు

Uttar Pradesh: యూపీలోని బాగ్పత్లో విషాదం జరిగింది. లడ్డూ మహాత్సవంలో వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.



