జాతియం

Donald Trump: మేమిద్దరం ‘చేతల మనుషులం’.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు

Donald Trump: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. “మేమిద్దరం పనులు చక్కబెట్టగల నాయకులం” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయని ఈ పోస్ట్ ద్వారా అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ వారం ఆరంభంలో ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగిన నేపథ్యంలో ఈ పోస్ట్ తెలిపారు . ఆ ఫోన్ కాల్‌లో ప్రధానంగా ఇరాన్ సంక్షోభంపైనే చర్చ జరిగింది.

ట్రంప్‌తో ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితులపై ఫలవంతమైన చర్చ జరిగింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతిస్తుంది.

ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి మార్గం తెరిచి ఉండటం, సురక్షితంగా ఉండటం ప్రపంచమంతటికీ అత్యంత అవసరం. శాంతి, స్థిరత్వం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై నిరంతరం సంప్రదింపులు జరపాలని మేం అంగీకరించామని మోడీ తెలిపారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, వారి మిత్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. ఈ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను, ముఖ్యంగా ఇంధన ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

గత కొన్నేళ్లుగా ట్రంప్, మోదీల మధ్య బలమైన రాజకీయ భాగస్వామ్యం కొనసాగుతోంది. వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక అంశాల్లో ఇరు దేశాల సహకారం గణనీయంగా పెరిగింది. తాజా సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రాంతీయ భద్రత కోసం కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button