ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక దాదాపు 25 రోజుల పాటు జరగనున్న ఈ అధ్యయనోత్సవాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.



