తెలంగాణ
KTR: దేశం కోసం జీవితాన్ని ధారపోసినవారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది

KTR: రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై దేశం మొత్తం విషాదంలో ఉందని.. అటువంటి సమయంలో రాహుల్ గాంధీ వియత్నం పర్యటన చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
ఇది పార్టీ కోసం, దేశం కోసం జీవితాంతం సర్వస్వం ధారపోసిన నాయకులను అవమానపరచడమే అన్నారు. అలా అవమాన పరచడం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు స్వర్గీయ పీవీ నరసింహారావుకి.. కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని కేటీఆర్ అన్నారు.