తెలంగాణ
Patnam Narender Reddy: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసు నోటీసులు..

Patnam Narender Reddy: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. రోటిబండ తండావాసులు దాడి చేసిన ఘటనలో జనవరి 2న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడి బెయిల్ ఇచ్చింది.
కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతామని డిసెంబర్ 26న ఐజీ సత్యనారాయణ ప్రకటించారు. ఇదే విషయమై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.