తెలంగాణ
Eatala Rajendar: పదవులకన్నాఆత్మగౌరవం ముఖ్యం

Eatala Rajendar: ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానం అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పిల్లలకు వారస్వత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదు విలువలు, సంప్రదాయాలు అని ఈటల అన్నారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈటల ఆవిష్కరించారు.
మహనీయుల విగ్రహాలను పెట్టుకోవడం, జయంతులు, వర్ధంతులు చేసుకోవడం అంటే వారి చరిత్ర భావితరాలకు అందించడమేనని ఈటల అన్నారు. సెప్టెంబర్ 17న జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ ప్రజల రక్త తర్పణానికి గుర్తు అని ఈటల అన్నారు.



