జాతియం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్లో తుపాకుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్రం. దీంతో అడవులను భద్రతాబలగాలు జల్లెడపడుతున్నాయి.
ఇటీవల కాలంలో మావోయిస్టు కీలక నేతలు హతం కాగా తాజాగా మరో ఇద్దరు నారాయణ్పూర్ ప్రాంతంలో హతం అవ్వడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దెబ్బమీద దెబ్బ వరుసగా తగులుతుండటంతో మావోస్టులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.