బీఆర్కే భవన్లో ముగిసిన హరీష్రావు విచారణ

బీఆర్కే భవన్లో మాజీ మంత్రి హరీష్రావు విచారణ ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ కొనసాగింది.
విచారణలో భాగంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను కమిషన్కు వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు కమిషన్కు చెప్పారు హరీష్ రావు.
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు కమిషన్కు వివరించారు హరీష్ రావు. వాప్కోస్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మారిందని కమిషన్ ఎదుట హరీష్ రావు వెల్లడించారు. అన్ని ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం కూడా ఉందని జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట వివరంచారు హరీష్ రావు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలం మార్పు ఇంజినీర్ల సూచన మేరకే జరిగిందన్నారు తెలిపారు హరీష్ రావు. ప్రాజెక్టుల స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందన్నారు హరీష్ రావు.