తెలంగాణ
Uttam Kumar Reddy: ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించింది

Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్లో ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం భారత గగనతలాన్ని కాపాడటంలో కీలక పాత్ర పొషించిందన్నారు. ఫైటర్ విమానాలు, ఆయుధాలు సమయానికి అందలేదని ఎయిర్ చీఫ్ ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు.
ఆపరేషన్లో ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. భారత వాయుసేనలో విమానాలను ఆధునీకరించాలన్నారు. జరిగిన నష్టాన్ని వెల్లడించాలని అడుగుతున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.