జాతియం
India-Pakistan: భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు

India-Pakistan: భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. LOC, అరేబియా సముద్ర జలాలతోపాటు గగనతలంలో ఇరుదేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా నోటీస్ టు ఎయిర్ మిషన్స్ ఇరు దేశాలు జారీ చేసుకున్నాయి. గగనతలంలో భారత్ విమానాలు మా గగనతలంలో పాక్ విమానాలు తిరుగొద్దని ఆంక్షలు విధించాయి.
మరోవైపు యుద్ధ నౌకలను ఇటు భారత్ అటు పాకిస్తాన్ మోహరించాయి. కరాచీ పోర్టులో 6.., ఒర్మారా పోర్టులో 4 పాక్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటు గుజరాత్ పోరుబందర్ దగ్గర భారత్ యుద్ధ నౌకలు మోహరించాయి.