సినిమా

మురళీ నాయక్ కుటుంబానికి బాలయ్య, పవన్ సాయం

అమర సైనికుడు మురళీ నాయక్ కుటుంబానికి బాలయ్య, పవన్ భారీ సాయం చేశారు. గొప్ప మనసుతో విరాళాలు అందించి మరోసారి తమ మంచి తనాన్ని చూపించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖుల సాయం కొనసాగుతోంది. అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోమ్ మినిస్టర్ అనిత నివాళులర్పించారు.

ప్రభుత్వం రూ. 50 లక్షలు, 5 ఎకరాల భూమి, 300 గజాల స్థలం, తండ్రికి ఉద్యోగం ప్రకటించింది. పవన్ కళ్యాణ్ రూ. 25 లక్షల విరాళం అందించి, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ తన హిందూపూర్ ఎమ్మెల్యే జీతాన్ని మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తానని ప్రకటించారు. ఇది ఒక్క నెల జీతమా లేక ప్రతి నెలా ఇస్తారా అన్నది సస్పెన్స్. ఈ సాయం కుటుంబానికి ఆదుకుంటుందని అంతా ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button