జాతియం
Haryana: విషాదం.. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Haryana: హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు కారులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మృతులంతా డెహ్రాడూన్కి చెందిన వారిగా గుర్తించారు. అప్పులబాధతోనే చనిపోయినట్లు సమాచారం.
వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ ఫ్యామిలీగా గుర్తించారు పోలీసులు. పంచకుల దగ్గర పార్క్ చేసిన కారులో మృత దేహాలు ఉండగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వీరంతా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కారులో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.