Secunderabad: మారనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకు వచ్చే, మన కళ్లలో మెదిలే రూపు రేఖలు ఇక కను మరుగవుతున్నాయి. 150ఏళ్ల చరిత్ర ఉన్న చారిత్రక కట్టడం కనుమరుగవుతుంది. రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో బాగంగా పురాతన కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు స్టేషన్ వెనక భాగం పూర్తిగా కూల్చివేసి భవనాల నిర్మాణం చేస్తున్నారు. ఐతే రైల్వే స్టేషన్ కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే ముందు భాగం కూల్చివేతలు కూడా అధికారులు ప్రారంభించారు.
ఇది రైల్వే స్టేషన్ ప్రధాన భవనం ఇప్పటికే రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అనేక రైళ్లను ఇతర స్టేషన్ లలో నిలుపుదల చేసి ప్రయాణికులకు సమాచారమిస్తూ సేవలందిస్తున్నారు. ప్రయాణికులకుఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఇంకో వైపు పునరుద్ధరణ పనులను కూడా చేస్తున్నారు. నూతన భవన నిర్మాణం అంతర్జాతీయ విమానాశ్రయానికి..ఏ మాత్రం తీసిపోకుండా నిర్మిస్తున్నారు.