తెలంగాణ
Kishan Reddy: కాంగ్రెస్ది ప్రజాప్రభుత్వం కాదు… ప్రజలను మోసం చేసే ప్రభుత్వం

Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని మండిపడ్డారు. కేంద్రం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
ఎరువులపై రైతుల దగ్గర నామమాత్రపు డబ్బు వసూలు చేస్తున్నామన్నారు. రైతులు పండించే పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తోందన్నారు. ఎరువుల ధరలు పెరిగినా కేంద్రం రైతులపై భారం వేయలేదన్నారు. పెరిగిన భారమంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు.