తెలంగాణ
KTR: రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా తిరుగుతుంది

KTR: మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా తిరుగుతుందని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ సోదరులతో పాటు మరో ఆరుగురు టీమ్లుగా ఏర్పడి కంపెనీల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూల్ చేస్తున్నారని విమర్శించారు.
భూ దందాలను పక్కదారి పట్టించేందుకు రేవంత్ సర్కార్ అనేక అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల పార్టీ అని కేటీఆర్ అన్నారు.