ఆంధ్ర ప్రదేశ్
Chittoor: ఏనుగుల దాడిలో రైతు మృతి

Chittoor: చిత్తూరు జిల్లా కుర్మానిపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాగి పంటకు కాపలాగా ఉన్న కిట్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఏనుగులను తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.



