ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: సుప్రీంకోర్టులో జగన్కు ఊరట

YS Jagan: వైసీపీ అధినేత జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పాటు జగన్ పై ఉన్న కేసులను వేరే న్యాయస్ధానానికి బదిలీ చేయాలంటూ కూడా రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు.
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఆ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. రెండు పిటీషన్లను సుప్రీంకోర్టులను డిస్మిస్ చేసింది. కొద్దిరోజుల నుంచి విచారణ జరిపిన ధర్మాసనం నేడు రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను కొట్టివేయడంతో దీంతో సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది.