లైఫ్ స్టైల్

చలికాలంలో మీ పాదాలు పగులుతున్నాయా? ఈ చిట్కాలతో తో చెక్ పేటండీ

Cracked Heels: వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరినీ చర్మ సంబంధింత సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటి వాటిల్లో పాదాల పగుళ్లు ఒకటి. ఈ సమస్య చాలా మందిలో తీవ్రంగా ఉంటుంది. ఇవి చూడటానికి బాగుండకపోవడం ఒకెత్తయితే.. కొందరికి నడుస్తుంటేనే నొప్పిగా ఉంటాయి. చివరకు.. రాత్రి పడుకునేముందు బెడ్ షీట్స్ కప్పుకొంటున్నా.. ఇబ్బందిపెడతాయి. ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాలతో సరి చేసుకోవచ్చు. అవేంటంటే..

*రోజూ స్నానం చేసే సమయంలో పాదాలను ప్యూమిన్ స్టోన్‌తో రాయాలి. అనంతరం కొబ్బరి నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల పగుళ్ల సమస్య త్వరగా దూరం అవుతుంది.
*రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్‌ రాయాలి.
*కొబ్బరి నూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు అప్లై చేసినా బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది.
*ఒకవేళ మీ మడమలు ఇప్పటికే పగిలి ఉంటే పాదాలకు రెగ్యులర్‌గా వాస్లెన్‌ అప్లై చేయాలి. అనంతరం రాత్రంగా సాక్స్‌లను ధరించాలి. ఇది పొడి చర్మం సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
*కొంతమందికి కాళ్లు, పాదాలు పొడిగా మారి ఇబ్బంది గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఆయిల్‌ని గోరువెచ్చగా చేసి దానితో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తేమగా మారతాయి.

*పెరుగు, వెనిగర్‌ని సమపాళ్లలో తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసి.. ఆ మిశ్రమంతో బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మెత్తగా మారతాయి.
*అరటి పండ్ల గుజ్జులా చేయాలి. దీనిని పాదాలకు రాయాలి ఓ పది నిమిషాలు వదిలేయాలి.. ఆ తర్వాత బాగా మసాజ్ చేయాలి. ఓ 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్ల సమస్య దూరమై అందంగా తయారవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button