ఆంధ్ర ప్రదేశ్
CPI Ramakrishna: కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతుంది

CPI Ramakrishna: కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుగుతుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వం తీరు, రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళాలో కూడా 30 మంది తోక్కిసలాటలో మృతి చెందారని కానీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
కుంభమేళా పేరుతో మోడీ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. అనంతరం సీఎం చంద్రబాబు సాగునీటి రంగంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 36 సంవత్సరాలలు అవుతున్న సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం దారుణమన్నారు.



