Medaram Mini Jathara: మినీ మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ

Medaram Mini Jathara: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. మినీ మేడారం జాతరకు భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుంచి భక్తులు తరలివచ్చారు. మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనంతో నిండి పోయారు.భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారాలమ్మలకు… పసుపు కుంకుమలతో, చీరసారలతో మొక్కులు చెల్లించు కుంటున్నారు.
మూడు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు భక్తులు పది నుంచి 20 లక్షల మంది వస్తారని అధికారులు తెలిపారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారంలో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ భక్తులకు ఇబ్బందులు తప్పడం లేవు. గుడి ప్రాంగణంలో క్యూలైన్లు సరిగా లేకపోవడంతో… తోపుసులాట జరుగుతుందని భక్తులు అంటున్నారు. వాటర్ సదుపాయం కూడా అధికారులు ఏర్పాటు చేయలేదని భక్తుల ఆరోపిస్తున్నారు.